లూకా సువార్త 20 : 1 (ERVTE)
{యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం} (మత్తయి 21:23-27; మార్కు 11:27-33) [PS] ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు.
లూకా సువార్త 20 : 2 (ERVTE)
“ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు. [PE][PS]
లూకా సువార్త 20 : 3 (ERVTE)
ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి.
లూకా సువార్త 20 : 4 (ERVTE)
యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 20 : 5 (ERVTE)
వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు
లూకా సువార్త 20 : 6 (ERVTE)
ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’
లూకా సువార్త 20 : 7 (ERVTE)
అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. [PE][PS]
లూకా సువార్త 20 : 8 (ERVTE)
యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 20 : 9 (ERVTE)
{రైతుల ఉపమానం} (మత్తయి 21:33-46; మార్కు 12:1-12) [PS] ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు.
లూకా సువార్త 20 : 10 (ERVTE)
పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు.
లూకా సువార్త 20 : 11 (ERVTE)
ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు.
లూకా సువార్త 20 : 12 (ERVTE)
అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు. [PE][PS]
లూకా సువార్త 20 : 13 (ERVTE)
“ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు.
లూకా సువార్త 20 : 14 (ERVTE)
కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు.
లూకా సువార్త 20 : 15 (ERVTE)
అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు. [PE][PS] “ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు?
లూకా సువార్త 20 : 16 (ERVTE)
వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు. [PE][PS] ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు.
లూకా సువార్త 20 : 17 (ERVTE)
యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి: ‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’? కీర్తన 118:22
లూకా సువార్త 20 : 18 (ERVTE)
ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 20 : 19 (ERVTE)
శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు. [PE][PS]
లూకా సువార్త 20 : 20 (ERVTE)
{యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం} (మత్తయి 22:15-22; మార్కు 12:13-17) [PS] వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది.
లూకా సువార్త 20 : 21 (ERVTE)
ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు.
లూకా సువార్త 20 : 22 (ERVTE)
మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు. [PE][PS]
లూకా సువార్త 20 : 23 (ERVTE)
వాళ్ళ పన్నాగం గమనించి
లూకా సువార్త 20 : 24 (ERVTE)
యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు. [PE][PS] “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు. [PE][PS]
లూకా సువార్త 20 : 25 (ERVTE)
ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 20 : 26 (ERVTE)
ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు. [PE][PS]
లూకా సువార్త 20 : 27 (ERVTE)
{కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం} (మత్తయి 22:23-33; మార్కు 12:18-27) [PS] చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు:
లూకా సువార్త 20 : 28 (ERVTE)
“బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు.
లూకా సువార్త 20 : 29 (ERVTE)
ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు.
లూకా సువార్త 20 : 30 (ERVTE)
రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు.
లూకా సువార్త 20 : 31 (ERVTE)
మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు.
లూకా సువార్త 20 : 32 (ERVTE)
చివరకు ఆమెకూడా మరణించింది.
లూకా సువార్త 20 : 33 (ERVTE)
మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు. [PE][PS]
లూకా సువార్త 20 : 34 (ERVTE)
యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు.
లూకా సువార్త 20 : 35 (ERVTE)
పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు.
లూకా సువార్త 20 : 36 (ERVTE)
వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు.
లూకా సువార్త 20 : 37 (ERVTE)
మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’ [*‘ప్రభువు … దేవుడు’ నిర్గమ. 3:6 చూడండి.] అని వ్రాసాడు.
లూకా సువార్త 20 : 38 (ERVTE)
ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 20 : 39 (ERVTE)
కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు.
లూకా సువార్త 20 : 40 (ERVTE)
ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు. క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా? (మత్తయి 22:41-46; మార్కు 12:35-37) [PE][PS]
లూకా సువార్త 20 : 41 (ERVTE)
ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు?
లూకా సువార్త 20 : 42 (ERVTE)
(42-43) దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా! ‘ప్రభువు నా ప్రభువుతో: [QBR] నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ [QBR2] నా కుడి వైపు కూర్చో’ కీర్తన 110:1
లూకా సువార్త 20 : 43 (ERVTE)
లూకా సువార్త 20 : 44 (ERVTE)
దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు. (మత్తయి 23:1-36; మార్కు 12:38-40, లూకా 11:37-54) [PE][PS]
లూకా సువార్త 20 : 45 (ERVTE)
{శాస్త్రుల్ని విమర్శించటం} [PS] ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు:
లూకా సువార్త 20 : 46 (ERVTE)
“శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు.
లూకా సువార్త 20 : 47 (ERVTE)
వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: