లూకా సువార్త 4 : 1 (ERVTE)
{సైతాను యేసును శోధించటం} (మత్తయి 4:1-11; మార్కు 1:12-13) [PS] యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు.
లూకా సువార్త 4 : 2 (ERVTE)
అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. [PE][PS]
లూకా సువార్త 4 : 3 (ERVTE)
సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 4 (ERVTE)
యేసు, “ ‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. ద్వితీయోపదేశ 8:3 [PS]
లూకా సువార్త 4 : 5 (ERVTE)
ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు.
లూకా సువార్త 4 : 6 (ERVTE)
ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను.
లూకా సువార్త 4 : 7 (ERVTE)
నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 8 (ERVTE)
యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి, [QBR2] ఆయన సేవ మాత్రమే చెయ్యి’ ద్వితీయోపదేశ 6:13 అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. [PS]
లూకా సువార్త 4 : 9 (ERVTE)
సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.
లూకా సువార్త 4 : 10 (ERVTE)
‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు’ కీర్తన. 91:11]
లూకా సువార్త 4 : 11 (ERVTE)
అంతేకాక: ‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా [QBR2] నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’ కీర్తన 91:12 అని వ్రాయబడింది” అని అన్నాడు. [PS]
లూకా సువార్త 4 : 12 (ERVTE)
యేసు, “ ‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు’ ద్వితీయోపదేశ 6:16 అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
లూకా సువార్త 4 : 13 (ERVTE)
ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 14 (ERVTE)
{గలిలయలో యేసుని సేవా ప్రారంభం} (మత్తయి 4:12-17; మార్కు 1:14-15) [PS] యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది.
లూకా సువార్త 4 : 15 (ERVTE)
ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు. [PE][PS]
లూకా సువార్త 4 : 16 (ERVTE)
{యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం} (మత్తయి 13:53-58; మార్కు 6:1-6) [PS] ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు.
లూకా సువార్త 4 : 17 (ERVTE)
అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
లూకా సువార్త 4 : 18 (ERVTE)
“ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు [QBR2] నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. [QBR] అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. [QBR] బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని, [QBR2] గుడ్డివారికి చూపు కలిగించాలని, [QBR] హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు. [QBR2]
లూకా సువార్త 4 : 19 (ERVTE)
ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.” యెషయా 61:1-2] [PS]
లూకా సువార్త 4 : 20 (ERVTE)
ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి.
లూకా సువార్త 4 : 21 (ERVTE)
ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 22 (ERVTE)
అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు. [PE][PS]
లూకా సువార్త 4 : 23 (ERVTE)
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ ‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు.
లూకా సువార్త 4 : 24 (ERVTE)
ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు. [PE][PS]
లూకా సువార్త 4 : 25 (ERVTE)
“ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది.
లూకా సువార్త 4 : 26 (ERVTE)
సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు. [PE][PS]
లూకా సువార్త 4 : 27 (ERVTE)
“ప్రవక్త ఎలీషా [*ఎలిషా ఏలియా కాలం తరువాత నివసించిన ప్రవక్త ఎలీషా.] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే [†కుష్ట రోగము గ్రీకు పదము తత్సంబంధమైన ఇతర రోగాలను కూడా సూచిస్తుంది.] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.” [PE][PS]
లూకా సువార్త 4 : 28 (ERVTE)
సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది.
లూకా సువార్త 4 : 29 (ERVTE)
వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు.
లూకా సువార్త 4 : 30 (ERVTE)
కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 31 (ERVTE)
{యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం} (మార్కు 1:21-28) [PS] అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు.
లూకా సువార్త 4 : 32 (ERVTE)
ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు. [PE][PS]
లూకా సువార్త 4 : 33 (ERVTE)
అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా,
లూకా సువార్త 4 : 34 (ERVTE)
“ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది.
లూకా సువార్త 4 : 35 (ERVTE)
యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది. [PE][PS]
లూకా సువార్త 4 : 36 (ERVTE)
అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు.
లూకా సువార్త 4 : 37 (ERVTE)
ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది. యేసు పేతురు అత్తను నయం చేయటం (మత్తయి 8:14-17; మార్కు 1:29-34) [PE][PS]
లూకా సువార్త 4 : 38 (ERVTE)
యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు.
లూకా సువార్త 4 : 39 (ERVTE)
యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది. [PS]
లూకా సువార్త 4 : 40 (ERVTE)
{యేసు అనేకులను నయం చేయటం} [PS] సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు.
లూకా సువార్త 4 : 41 (ERVTE)
“నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 42 (ERVTE)
{యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం} (మార్కు 1:35-39) [PS] తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు.
లూకా సువార్త 4 : 43 (ERVTE)
కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 4 : 44 (ERVTE)
ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: