మత్తయి సువార్త 2 : 1 (ERVTE)
{తూర్పు నుండి జ్ఞానులు రావటం} [PS] హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి
మత్తయి సువార్త 2 : 2 (ERVTE)
“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 3 (ERVTE)
ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు.
మత్తయి సువార్త 2 : 4 (ERVTE)
అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని [*పండితుల్ని లేక శాస్త్రుల్ని.] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు.
మత్తయి సువార్త 2 : 5 (ERVTE)
వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:
మత్తయి సువార్త 2 : 6 (ERVTE)
“ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా! [QBR2] నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు! [QBR] ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. [QBR2] ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’ ” మీకా 5:2] [PS]
మత్తయి సువార్త 2 : 7 (ERVTE)
ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు.
మత్తయి సువార్త 2 : 8 (ERVTE)
వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 9 (ERVTE)
వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది.
మత్తయి సువార్త 2 : 10 (ERVTE)
వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 11 (ERVTE)
ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు.
మత్తయి సువార్త 2 : 12 (ERVTE)
హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు. [PS]
మత్తయి సువార్త 2 : 13 (ERVTE)
{ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం} [PS] వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 14 (ERVTE)
యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు.
మత్తయి సువార్త 2 : 15 (ERVTE)
యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను” [✡ఉల్లేఖము: హొషేయ 11:1.] అని అన్న మాట నిజమైంది. [PS]
మత్తయి సువార్త 2 : 16 (ERVTE)
{హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం} [PS] జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు.
మత్తయి సువార్త 2 : 17 (ERVTE)
తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:
మత్తయి సువార్త 2 : 18 (ERVTE)
“రామా గ్రామంలో అతి దుఃఖంతో [QBR2] ఏడుస్తున్న స్వరం వినిపించింది. [QBR] రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది. [QBR2] ఎవరు ఓదార్చిన వినలేదు. [QBR2] ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.” యిర్మీయా 31:15 [PS]
మత్తయి సువార్త 2 : 19 (ERVTE)
{నజరేతుకు తిరుగు ప్రయాణం} [PS] హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి,
మత్తయి సువార్త 2 : 20 (ERVTE)
“లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 2 : 21 (ERVTE)
అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు.
మత్తయి సువార్త 2 : 22 (ERVTE)
కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు.
మత్తయి సువార్త 2 : 23 (ERVTE)
అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: