మత్తయి సువార్త 14 : 1 (IRVTE)
{బాప్తిసమిచ్చే యోహాను వధ} (మార్కు 6:14-29; లూకా 9:7-9) [PS] ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని,
మత్తయి సువార్త 14 : 2 (IRVTE)
“ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు.
మత్తయి సువార్త 14 : 3 (IRVTE)
అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు
మత్తయి సువార్త 14 : 4 (IRVTE)
హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు.
మత్తయి సువార్త 14 : 5 (IRVTE)
హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 6 (IRVTE)
హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
మత్తయి సువార్త 14 : 7 (IRVTE)
కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
మత్తయి సువార్త 14 : 8 (IRVTE)
తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
మత్తయి సువార్త 14 : 9 (IRVTE)
ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు.
మత్తయి సువార్త 14 : 10 (IRVTE)
భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 11 (IRVTE)
వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
మత్తయి సువార్త 14 : 12 (IRVTE)
యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 13 (IRVTE)
యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు.
మత్తయి సువార్త 14 : 14 (IRVTE)
యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు. [PS]
మత్తయి సువార్త 14 : 15 (IRVTE)
{యేసు ఐదు వేలమంది ఆకలి తీర్చడం} (మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహా 6:1-14) [PS] సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు.
మత్తయి సువార్త 14 : 16 (IRVTE)
యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు.
మత్తయి సువార్త 14 : 17 (IRVTE)
వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు.
మత్తయి సువార్త 14 : 18 (IRVTE)
అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.
మత్తయి సువార్త 14 : 19 (IRVTE)
ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 20 (IRVTE)
వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.
మత్తయి సువార్త 14 : 21 (IRVTE)
స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు. యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం (మార్కు 6:45-56; యోహా 6:15-21) [PS]
మత్తయి సువార్త 14 : 22 (IRVTE)
యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
మత్తయి సువార్త 14 : 23 (IRVTE)
ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
మత్తయి సువార్త 14 : 24 (IRVTE)
అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది. [PE][PS]
మత్తయి సువార్త 14 : 25 (IRVTE)
రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
మత్తయి సువార్త 14 : 26 (IRVTE)
ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
మత్తయి సువార్త 14 : 27 (IRVTE)
వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.
మత్తయి సువార్త 14 : 28 (IRVTE)
పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు.
మత్తయి సువార్త 14 : 29 (IRVTE)
యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
మత్తయి సువార్త 14 : 30 (IRVTE)
గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.
మత్తయి సువార్త 14 : 31 (IRVTE)
వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 32 (IRVTE)
యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.
మత్తయి సువార్త 14 : 33 (IRVTE)
అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు. [PE][PS]
మత్తయి సువార్త 14 : 34 (IRVTE)
వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.
మత్తయి సువార్త 14 : 35 (IRVTE)
అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
మత్తయి సువార్త 14 : 36 (IRVTE)
“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: