మత్తయి సువార్త 4 : 1 (IRVTE)
{యేసు ఎదుర్కొన్న పరీక్ష} (మార్కు 1:12-13; లూకా 4:1-13; ఆది 3:6) [PS] అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
మత్తయి సువార్త 4 : 2 (IRVTE)
నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.
మత్తయి సువార్త 4 : 3 (IRVTE)
శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు.
మత్తయి సువార్త 4 : 4 (IRVTE)
అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.
మత్తయి సువార్త 4 : 5 (IRVTE)
అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి,
మత్తయి సువార్త 4 : 6 (IRVTE)
“నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, [QBR] ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. [QBR] నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 7 (IRVTE)
అందుకు యేసు “ ‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు.
మత్తయి సువార్త 4 : 8 (IRVTE)
అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు.
మత్తయి సువార్త 4 : 9 (IRVTE)
“నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు.
మత్తయి సువార్త 4 : 10 (IRVTE)
అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 11 (IRVTE)
అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు. [PS]
మత్తయి సువార్త 4 : 12 (IRVTE)
{యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక} (మార్కు 1:14; లూకా 4:14-15) [PS] యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.
మత్తయి సువార్త 4 : 13 (IRVTE)
ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్నహూములో నివసించాడు. అది గలిలయ సముద్ర తీరాన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఉంది. [QBR]
మత్తయి సువార్త 4 : 14 (IRVTE)
(14-16) “జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, [QBR] యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న [QBR] యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో [QBR] చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. [QBR] చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.” [QBR] అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది. [PE][PS]
మత్తయి సువార్త 4 : 15 (IRVTE)
మత్తయి సువార్త 4 : 16 (IRVTE)
మత్తయి సువార్త 4 : 17 (IRVTE)
అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు. [PS]
మత్తయి సువార్త 4 : 18 (IRVTE)
{పేతురు అంద్రెయలకు పిలుపు} (లూకా 5:2-11) [PS] యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు.
మత్తయి సువార్త 4 : 19 (IRVTE)
యేసు వారితో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని పిలిచాడు.
మత్తయి సువార్త 4 : 20 (IRVTE)
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు. జెబెదయి కొడుకులు యాకోబు, యోహానులకు పిలుపు [PE][PS]
మత్తయి సువార్త 4 : 21 (IRVTE)
యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు.
మత్తయి సువార్త 4 : 22 (IRVTE)
వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 23 (IRVTE)
యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు.
మత్తయి సువార్త 4 : 24 (IRVTE)
ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు.
మత్తయి సువార్త 4 : 25 (IRVTE)
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: