1. {ఫిలిప్తీయుల గురించిన సందేశం} PS ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
|
2. యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. |
3. పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు. |
4. ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. క్రేతు *క్రేతు “కఫోరు” ద్వీపమని దీని శబ్దార్థం. దీన్ని కొన్ని సార్లు క్రేతు అని, మరికొన్ని సార్లు కుప్ర అని అనటం కద్దు. బైబిలు ప్రకారం ఫిలిష్తీయులు ప్రథమంగా కఫ్తోరునుండి వచ్చారు. ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. |
5. గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు? †ఎంతకాలం … గాయపర్చుకుంటారు తమ విచారాన్ని సూచించేందుకు ప్రజలు తమ శరీరాలను చీరుకొని గాయపర్చుకునేవారు. |
6. “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము! ఆగిపో! శాంతించు, అని మీరంటారు. |
7. కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.” PE |