1. {గోత్రాలు గూర్చి మోషే పలికిన దీవెనలు} PS దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. PEPS యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు
|
2. శేయీరు నుంచి వారికి ఉదయించాడు.
ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. |
3. నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు.
ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. |
7. యూదా గురించి మోషే ఇలా పలికాడు,
యెహోవా, యూదా ప్రజల మనవి విని, మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి |
8. లేవీ గురించి మోషే ఇలా పలికాడు,
నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. |
9. నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి,
తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చెయ్యలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. నీ నిబంధన పాటించాడు. |
10. అతడు యాకోబుకు నీ విధులనూ,
ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. |
11. యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు,
అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచే వారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్ళు మళ్ళీ లేవరు. |
12. బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు,
యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. |
13. యోసేపు గురించి మోషే ఇలా పలికాడు.
యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో, |
16. భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో,
పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక. |
17. తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది.
అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. మనష్షేకు చెందిన వేలమంది. |
18. జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు,
జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. |
19. వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు.
అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధినీ సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. |
20. గాదు గురించి మోషే ఇలా పలికాడు.
గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. |
21. అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు.
నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. |
23. నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు.
కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. |
24. ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు,
మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు |
26. యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు
నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. |
27. నిత్య దేవుడు నీకు ఆశ్రయం,
శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు. |
28. ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు.
యాకోబు * యాకోబు నీటి ఊట నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. |
29. ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు!
యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి † వీపులను ఎత్తయిన స్థలాలను తొక్కుతావు. PE |